రాజమహేంద్రవరం నగరం మరియు పరిసర ప్రాంత గ్రామాలను సుందరంగా తీర్చిదిద్ది, మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించి, నిరంతరం ప్రజా సంక్షేమాల కోసం కృషి చేస్తున్న మన ప్రియతమ నేత రాజమండ్రి ముద్దుబిడ్డ, మాజీ మంత్రి, రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెబ్ సైట్ కి స్వాగతం, సుస్వాగతం .
శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు , 35 సవత్సరాలుగా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ అభివృదికి పనిచేసారు. క్రమశిక్షణ సంఘం సభ్యడిగా పనిచేసారు. రాష్ట ప్రదాన కార్యదర్శిగా ఉత్రరాంధ్ర,కోస్తాంధ్ర మరియు రాయలసీమకి పనిచేసారు. అనేక కమీటీలలో పనిచేసి,ఇతరాత్ర పదవులలో కొనసాగి అనేక కార్యక్రమాలు చేపట్టారు.
ముఖ్యంగా రాజమహేంద్రవరంకి రూపురేఖలు తేవడంలో ప్రదానమైన పాత్ర పోషించారు.మంచినీటి సరఫరా, పాటశాల భవనాల నిర్మాణం,హాస్పటల్స్ అభివృద్దిలో,రోడ్లు వైశాల్యం, గోదావరి గట్టు సుందరీకరణ, ప్రజా మరుగుదొడ్లు,ఈ సేవా కేంద్రాలు మీ సేవా కేంద్రాలు, కరెంట్ సరఫరా మరియూ ఉద్యానవనాల అభివృద్దిలో గణనీయంగా కృషి చేసారు, నగరం మీద మంచి పట్టున్న వ్యక్తిగా నిలిచారు.
పలు విధాలుగా నగరాబివ్రుద్దికి కృషి చేస్తూ , ఒక అనుభవం కలిగిన సీనియర్ నాయకుడిగా చట్టసభల్లో తనదైన శైలిలో రాష్ట్ర సమస్యలపై ఎలుగెత్తి చెప్పేవారు.
పోలవరం అమరావతి పై ముఖ్యమంత్రి గారికి సలహాలు సూచనలు ఇస్తూ. క్రమశిక్షణతో, విలువలతో కూడిన, మచ్చ లేని రాజకీయ నాయకుడిగా, ప్రజలకోసం పార్టీకోసం పాటుపడే ప్రజానాయకుడిగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం MLA అభ్యర్ది గా మరొక్కసారి మీ ఓఅట్లు అడగటానికి మీ ముందుకు వస్తున్నారు
సదా మీ సేవలో శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి
35 సంవత్సరాల రాజకీయ జీవితంలో కొన్ని మైలు రాళ్ళు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఎంతోమంది అసంఘటిత రంగానికి చెందిన వారున్నారు. అధికారుల లెక్కల ప్రకారం రెండు కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అసంఘటిత కార్మిక రంగం పరిధి లోనికి వచ్చే ప్రతీవ్యక్తి యొక్క కుటుంబ రక్షణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు “చంద్రన్న భీమా పధకం” ఏర్పాటు చేసారు. భారత దేశంలో అసంఘటిత కార్మికులకు భీమా కల్పించిన ఏకైక రాష్ట్రము “ఆంధ్రప్రదేశ్”.
నమోదుకు అర్హతలు వయసు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య కలిగిన అసంఘటిత రంగంలోని కార్మికులు రూ.15 చెల్లించిన పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి. ఇతర ఏ ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదు. ఆధార్, బ్యాంకు ఖాతా లేనివారికి సైతం వాటిని సమకూర్చి బీమా పథకంలో చేరుస్తారు. బీమా పథకం ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ఆసంఘటిత రంగంలోని కార్మికులు అంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యువనేస్తం అనే నూతన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని అర్హత కలిగిన సుమారు 12 లక్షల మంది నిరుద్యోగ యువతకు లబ్ది చేకూరుతుంది. యువత నైపుణ్యాభివృద్ధి / వృత్తి విద్యా కోర్సులు అభ్యసించేందుకు మరియు నిరుద్యోగ యువత యొక్క కుటుంబాలపై భారం తగ్గించేందుకు లబ్దిదారులకు నెల నెలా నిరుద్యోగ భృతిని అందజేస్తారు.
నిరుద్యోగ భృతి పొందేందుకు ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి నమోదు చేసుకోవడానికి కావలిసిన ముఖ్య ధ్రువపత్రాలు – ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎస్.ఎస్.సి, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఆసుపత్రి లో ఏ మందులు అందుబాటులో ఉన్నాయని వివరాలను ఆన్లైన్ లో తెలుసుకునేందుకు వీలుగా ఇ ఔషధి కార్యక్రమాన్ని ని జూన్ 10 2015 న ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికిపైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 9 జిల్లా, 30 ప్రాంతీయ ఆస్పత్రులు ,11 వైద్య కళాశాలలు అనుబంధ ఆస్పత్రిలో ఈ విధానం అమలులోకి వచ్చింది
ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ఐటీ ఆధారిత సమగ్ర ఆర్దిక నిర్వహణ వ్యవస్థ (సి ఎఫ్ ఎం ఎస్ ఎస్ ) కు ఈ నిధి అని పేరు పెట్టారు. * ( SAP )ఆధారంగా పనిచేసే ఈ కొత్త వ్యవస్థ తో బడ్జెట్ ఆదాయం వ్యయం మానవ వనరుల నిర్వహణ అకౌంట్స్ ,వేజ్ అండ్ మీన్స్ ,అప్పుల నిర్వహణ వ్యవహారాలను అనుసంధానం చేయనున్నారు.ఈ మొత్తం వ్యవహారాలన్నిటినీ ఆన్లైన్ ద్వారానే నిర్వహించనున్నందున ప్రభుత్వం దీనికి ఈ నీది అని నామకరణం చేసింది.
ఆపదలో ని మహిళలకు కు అండగా నిలిచేందుకు రూపొందించిన అభయం యాప్కు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు మరిన్ని అదనపు హంగులు జోడిస్తున్నారు ఇప్పటివరకు కేవలం మహిళల సేవలకు పరిమితమైన దీన్ని పురుషులు కూడా వినియోగించేందుకు వీలుగా తీర్చిదిద్దారు.
అత్యవసర వేళల్లో యాప్లోని పానిక్ అనే మీటను నొక్కి వెంటనే ఆ సమాచారం ఆ నగరంలోని command కంట్రోల్ రూమ్ కు అక్కడ నుంచి చి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు చేరుతుంది. జిపిఎస్ ఎస్ ఏ ఆధారం గా మహిళ ఎక్కడ ఆపదలో ఉందో గుర్తించి ఐదు నిమిషాల వ్యవధిలో ఆ స్థలానికి చేరుకుని ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తారు.
మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో భాగంగా అధికారులు గ్రామానికి వచ్చి కంప్యూటర్ లో ఉన్న భూముల వివరాలను వెల్లడిస్తారు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తమ భూములు సమ పేరుతో ఉన్నాయో లేదో ఏమైనా తప్పులు ఉంటే తెలుసుకుని వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సరి చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
పోషక ఆహార లోపం వల్ల గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులు రోగాల బారిన పడుతున్నారని 90 శాతం మరణాలకు కారణం ఇదేనని ,అందుకే గిరి ప్రాంతాల్లో ని ఆరు నెలలనుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు ‘గిరి గోరుముద్దలు ‘పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఆన్లైన్లో రోగికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం కేస్ షీట్ నిర్వహిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టేందుకు ఈ ఆరోగ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని విశాఖ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు పరుస్తారు.
సమస్త ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా కంప్యూటరీకరించాలనే ఉద్దేశ్యంతో రూ .2358 కోట్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును ఈ ప్రగతి ఇ పేరుతో పీపీపీ పద్ధతిలో చేపట్టాలని ఏపీ ప్రభుత్వం తీర్మానించింది.
మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1528 కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.మిగిలిన మొత్తాన్ని ప్రపంచ బ్యాంక్ సమకూర్చనుంది.సింగపూర్ కంపెనీలు విప్రోల సంయుక్త భాగస్వామ్యంలో మూడు దశల్లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేస్తారు.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 33 శాఖలు,315 హెచ్ఓడీలు,745 ఈ సేవలన్నిటిని ‘ఈ ప్రగతి ‘ పేరుతో ఒకే గొడుగు కిందకు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీన్ని 72 ప్రాజెక్టులు, 14 ప్యాకేజీలుగా వర్గీకరించారు. దక్షిణాసియా దేశాల్లో నే తొలిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడం విశేషం.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ‘అన్న దీవెన’ పేరిట బాలింతల కోసం సరికొత్త కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది.మాతృ, శిశు మరణాలు అరికట్టేందుకు బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు.పాత బెల్లం, రాగి పిండి,వేరుశనగలు, మదర్ హార్లిక్స్ తో పాటు గొడుగు,టోపీల తో కూడిన సరుకులను పంపిణీ చేస్తారు.
అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిని భాగస్వాములు చేసేలా ‘మన అమరావతి – మన మట్టి – మన నీరు’ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.ప్రతి గ్రామం,ప్రతి పురపాలక వార్డు నుంచి కిలో మట్టి పావు లీటర్ నీళ్ళు సేకరించి నూతన రాజధాని తరలించే ఏర్పాట్లు చేసింది.
రాష్ట్రంలోని 16 వేల గ్రామాల్లో అందరూ పవిత్ర పుణ్య జలాలను, పుట్టమట్టిని సేకరించి మంగళ హారతులు,పెద్దల ఆశీస్సులు నడుమ ఊరేగింపు చేసి ఇ మండల,జిల్లా కేంద్రాల ద్వారా రాజధానిని చేర్చడం ఈ కార్యక్రమ ఉద్దేశం.
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా నా ఇటుక నా అమరావతి అనే విన్నూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమాన్ని విజయవాడలో సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కనీసం ఒక ఇటుకనైనా విరాళంగా అందజేసేందుకు వీలుగా ఆన్లైన్ చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టారు. అమరావతి ఇటుకను ఆన్లైన్ విధానంలో ఎవరైనా కనీసం రూ.10 పెట్టి కొనుగోలు చేయవచ్చు.ఇలా కొనుగోలు చేసిన వారి వివరములను amaravati.gov.in ఎలక్ట్రానిక్ డేటాబేస్ లో ఉంచుతారు.
ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేయడంలో భాగంగా నిరుద్యోగ బ్రాహ్మణ యువత కోసం ద్రోణాచార్య పథకాన్నీ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించారు. ఇందులో భాగంగా నైపుణ్యాల అభివృద్ధిలో శిక్షణ ఇస్తారు.
ఎన్టీఆర్ జలసిరి పథకం కింద ఆంధ్రప్రదేశ్ భూగర్భ జలాలకు కొరతలేని చోట్ల ప్రభుత్వ ఖర్చులతో రైతులకు లక్ష బోర్లు తవ్వించి మోటార్లు కూడా బిగించి ఇస్తారు.విద్యుత్ కనెక్షన్ మోటార్ కు అయ్యే ఖర్చుతో ఎస్సీ,ఎస్టీ రైతులు 5 శాతం ఇతరులకు 20 శాతం భరిస్తే చాలు.
అనంతపురం జిల్లా మినహా రాష్ట్రమంతటా అమలు చేస్తున్నారు.అనంతపురం జిల్లా లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయిన కారణంగా మినహాయించారు. 12 జిల్లాల్లో ఆయకట్టు (కమాండ్), ఆయకటేతర (నాన్ కమాండ్) ప్రాంతాల్లో బోర్లు తవ్వించినా తర్వాత సబ్సిడీ కింద సూక్ష్మ సేద్యం సౌకర్యం కూడా కల్పించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మొత్తం 1,496 కోట్ల వ్యయంతో అవుతుందని ప్రణాళిక శాఖ అంచనావేసింది.
షీ ఆటో పథకం కింద మహిళలకు పూర్తిగా సిఎన్జీ తో నడిచే ఆటోలను పంపిణీ చేస్తారు. ఈ ఆటోలు పర్యావరణనికి హితమైనవి.మహిళా ప్రయాణికులకు రక్షణ కల్పించడానికి ఈ పథకం దోహదపడుతుందని సీఎం చెప్పారు.
రూ 1.91 లక్షలు ఇలా విలువచేసే ఒక్కో ఆటోకు ప్రభుత్వం ఏడు శాతం రాయితీ అందించగా మిగతా మొత్తాన్ని 40 వాయిదాల్లో నెలకు 4500 చొప్పున చెల్లించే అవకాశం లబ్ధిదారులకు కల్పించారు.
ప్రజలు నేరుగా తమకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు ‘ఇ-స్పందన’ డిజిటల్ పంచాయతి పోర్టల్ ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలో ఆవిష్కరించారు.
డిజిటల్ పంచాయతీ వెబ్ సైట్ ద్వారా వివాహ దృవీకరణ పత్రం,ఆస్తి విలువ పత్రం, మ్యుటేషన్, మంచి నీటి కుళాయి కనెక్షన్.నిరభ్యంతర పత్రం, భవన నిర్మాణాలకు అనుమతులు, లే అవుట్ అనుమతులు,జనన, మరణాల నమోదు,ఇంటి పన్ను చెల్లింపు,వృత్తి లైసెన్స్,ఉపాధి హామీ పనులు,జాబ్ చార్ట్ లాంటి సేవలు అన్ని ఆన్ లైన్ లొనే అందించుచున్నారు.
ఐటీ శాఖ రూపొందించిన ‘ఇ-స్పందన’ద్వారా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఐటి సమస్యలు ఏర్పడితే పోర్టల్ లాగిన్ అయ్యి ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో సగటు వర్షపాతం 940 మిల్లీ లీటర్లు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం, కొన్ని చోట్ల తక్కువ కురుస్తోంది.నీటిని నిల్వ చేసుకోవాలంటే రిజర్వాయర్లు కట్టుకోవాలి. భూమిని జలాశయంగా మార్చుకోవాలి.రాష్ట్రవ్యాప్తంగా ఒక మీటరు భూగర్భ జల మట్టం పెరిగిందంటే 90 టీఎంసీలు భూమిలో నిలవ చేసుకుంన్నట్లే.
ఏటా కురిసే సగటు వర్షపాతం ద్వారా 5 వేల టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుంది. కురిసిన వర్షాన్ని భూమిలోకి ఇంకే ఏర్పాటు చేసుకోవాలి. నీరు ఉంటే ప్రగతి సాధ్యమవుతుంది. అందుకే నీటికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ‘ నీరు-ప్రగతి’ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు.ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురంలో ‘నీరు-ప్రగతి’ కార్యక్రమాన్ని డిసెంబర్ 29న ప్రారంభించారు.
విజయనగరం జిల్లా బొండపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి జన్మభూమి కార్యక్రమం నాంది కావాలని పేర్కొన్నారు. 17 ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ (NTR Beach Festival)
ఏటా సంక్రాంతికి ముందు సాగర సంబరాల పేరుతో నిర్వహిస్తున్న ఉత్సవాలను ఎన్టీఆర్ బీచ్ ch ఫెస్టివల్ పేరుతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది
మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సంచార వైద్య చికిత్సను ప్రారంబించారు. పిరామిల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో 275 మొబైల్ మెడికిల్ యూనిట్ల (ఎంఎంయూ) వాహనాలను ఏర్పాటు చేశారు. రాష్టంలోని 13 వేల గ్రామాలలో ఈ సంచార వైద్య వాహనాలు సేవలందించనున్నాయి.గర్భిణిలకు, చిన్నారులకు, సాధారణ వ్యాధులకు, తీవ్రమైన అంటువ్యాధులకు, దంత, కంటి, ఈఎన్ టి సహా పలు వైద్య పరీక్షలను నిర్వహించి చికిత్స అందిస్తారు. వ్యాధి నిరోధక టీకాలను వేస్తారు.
దేశంలో నిర్వహించే అన్ని పోటి పరీక్షల్లో 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యార్దులు అగ్రగామిగా నిలవాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం ‘చంద్రన్న ఉన్నత విద్యాదీపం’ పథకాన్ని ప్రారంభించింది . 24 రోజుల పాటు గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లోని అంశాలను బోధిస్తూ శిక్షణ అందిస్తున్నారు.
పేద భక్తులను తిరుమల సహా రాష్ట్రంలోని మూడు, నాలుగు, పుణ్యక్షేత్రాలకు ఉచితంగా తీసుకేల్లెందుకు ‘ దివ్యదర్సనం’ పథకం ఏపి ప్రభుత్యం రూపొందించింది.
ఆలయాల్లో దర్సనం మొదలుకొని, రవాణా, వసతి, భోజనం తదితర వసతులన్నీ ఉచితమే ఇందుకయ్యే మొత్తం ఖర్చు దేవాదాయశాఖ భరించనుంది.
దివ్యదర్శనం పథకం క్రింద ఒక్కో జిల్లా నుంచి ఏడాదికి 10 వేల మంది చొప్పున , ఏడాదికి 1.30 లక్షల మంది భక్తుల్ని తీర్దయాత్రలకు తీకెళ్ళేలా దేవాదాయశాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో 90 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బిసీ వర్గాలకు చెందిన భక్తుల్ని తీసుకెళ్లాలని దేవాదాయశాఖ నిర్ణయించింది.
‘ఎన్టీఅర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం’ లో భాగంగా 2016-17 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం రెండు లక్షల ఇళ్ళను మంజూరు చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ,ఉపాధి హామీ నిధులతో వీటి నిర్మాణం చేపట్టనుంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2.25 లక్షలు కేటాయిస్తారు. ఒక్కో ఇల్లు ౩౦౦ చదరపు అడుగుల విస్తీర్ణం ( మరుగుదొడ్డితో సహా ) ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్య పాటశాలల్లో విద్యార్ధినుల హాజరుశాతాన్ని పెంచేందుకు ‘బడి కొస్తా’ అనే నూతన పతాకాన్ని రాష్త్రప్రభుత్యం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ పథకం అమల్లో భాగంగా తొలుత ప్రభుత్య ఎయిడెడ్, జడ్పి, పురపాలక, ఆదర్శ పాటశాలల్లోని తొమ్మిదో తరగతి విద్యార్ధినులకు ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో ప్రస్తుతమున్న 26 శాతం పచ్చదనాన్ని 2050 నాటికి 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు మొక్కలు నాటే కార్యక్రమం ఇది. రాష్ట్రంలో కొత్తగా 50 కోట్ల మొక్కలు నాటాలి. అనేది దీని ముఖ్యోద్దేశం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు పది మొక్కలు చొప్పున నాటితే 50 కోట్ల మొక్కలు అవుతాయి.
అనంతపురం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసి కరవును పారదోలేందుకు ‘ఎన్టీఅర్ ఆశయం’ పేరుతో ఏపి ప్రభుత్యం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. రూ. 6,554 కోట్లతో ఈ ప్యాకేజీని అమలు చేస్తారు. జిల్లాలో కరవు నివారణకు రూ. 1767 కోట్లు ; వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలకు రూ. 2654 కోట్లు, తాగునీటి ఎద్దడి నివారణకు రూ. 500 కోట్లు, పారిశ్రామిక అభివృద్ధికి రూ. 100 కోట్లు రహదారుల అభివృద్ధికి రూ.139 కోట్లు, స్వచ్చంధ్రప్రదేశ్ క్రింద రూ. 94 కోట్లు, పేరూరు జలాశయం తొలి దశకు రూ. 450 కోట్లు కేటాయించారు.
తక్కువ ధరలకే ప్రజలకు మందులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్యం ‘ అన్న సంజీవని’ పేరుతో జనరిక్ దుకాణాలను డ్వాక్రా సంఘాల ద్యారా నిర్వహిస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.చంద్రన్న బీమా 15 నుంచి 70 ఏళ్ల లోపు వారికి వర్తిస్తుంది.భీమా చెల్లించిన వ్యక్తి చనిపోయినా, పూర్తిగా వికలాంగుడైనా మూడు వారాల్లోగా 5 లక్షలు అందిస్తారు. చనిపోయిన వెంటనే 7 వేల రూపాయలు కుటుంబానికి అందిస్తారు. ఇందుకోసం 155214 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో దారిద్ర్యరేకకు ఎగువన ఉన్నవారికోసం ప్రవేశపెట్టిన ‘ఆరోగ్య రక్ష’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వపరంగా అమలవుతున్న ఎలాంటి ఆరోగ్య కార్యక్రమం పరిధిలోకి రాని సుమారు 35 లక్షల కుటుంబాలకు వైద్యసేవలు అందించే ఆశయంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఆరోగ్య రక్ష పథకంలో చేరాలనుకునే ఒక్క వ్యక్తికి రూ.100 చొప్పున ఏడాదికి 1200 చెల్లించాలి. కుటుంబలో సభ్యులందరూ చేరాలి.ఈ పథకంలో చేరిన వారికి 2 లక్షల వరకు ఉచిత వైద్య సేవ అందుతుంది.రాష్ట్రంలోని 432 ఆసుపత్రులలో 1,044 రకాల జబ్బులకు సేవలు పొందే సదుపాయం కలుగుతుంది.కుటుంబంలో ముగ్గురు ఉంటే ఆరు లక్షల వరకు వైద్య సేవలు పొందే అవకాశముంది. పథకం కాలం పరిమితి ఏడది ఉంటుంది.ఫిబ్రవరి 28వ తేదీ లోపు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లేదా మీ సేవలో ఆధార్ కార్డు ద్వారా పేర్లను నమోదు చేసుకుని ఆరోగ్య కార్డులను పొందవచ్చు.
పురపాలక సంఘాల్లో పౌర సమస్యలు పరిష్కరించడం, సేవలు మరింత సులభంగా అందించడానికి వీలుగా ఏపీ పురపాలక శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ ‘పురసేవ’ రూపొందించింది.పట్టణాలు, నగరాల్లో పౌరులు తన సమస్యలను ఈ యాప్ ద్వారా ఆయా పురపాలక సంఘానికి పంపితే అధికారులు తక్షణం ఆ సమస్యపై స్పందించి పరిష్కరించడంతో పాటు దానికి సంబంధించిన సమాచారాన్ని ఆ పౌరుడికి సెల్ ఫోన్ సందేశం కూడా పంపుతారు.
ఏపీ పర్సు అనేది వాడుకలో ఉన్న ఈ వ్యాలెట్ చెల్లింపు యాప్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ను ఒక వేదిక మీదకు తీసుకు రావడం. సైబర్ నెట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దీన్ని రూపొందించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను డిజిటల్ ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్ది,వాళ్లను నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించేందుకు ‘మార్పు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమం ద్వారా పది నెలల తో పాటు ప్రతిరోజు 446 వైద్య విద్యార్థుల బృందాలు గ్రామాల్లో 10 లక్ష్యాలతో పర్యటించి స్థానికులకు పరిసరాల పరిశుభ్రత,అనారోగ్యాల బారిన పడకుండా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు,తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు.